రెజ్లింగ్ లో భారత్ కు స్వర్ణం

-

ఆసియా క్రీడల్లో సత్తా చాటుతున్న భారత్

ఆసియా క్రీడల్లో భారత్ సత్తాను చాటుతోంది.  మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో వినేష్ ఫోగట్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ఫోగట్ జపాన్ రెజ్లర్ యుకీఐరీని 6-2 తేడాతో మట్టికరిపించి విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచే తనదైన ఆట ప్రతిభను కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫైనల్ పోటీ ఆరంభంలోనే 4-0 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఫోగట్ చివరి వరకు అదే ఆటను కొనసాగించడంతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అద్వితీయమైన ప్రతిభను కనబర్చిన ఫోగట్ ఆసియా గేమ్స్ రెజ్లింగ్ లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news