వ‌రి వేయాలంటే బండి సంజ‌య్ నాలుకకు వాత పెడ‌తారు : వినోద్ కుమార్

-

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్.. బీజేపీ పై ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి వద్ద వరి వేయాలని బండి సంజయ్ మాట్లాడితే నాలుక మీద వాత పెడుతారని… హెచ్చ‌రించారు. యాసంగి వడ్లు కొంటామని లిఖితపూర్వకంగా ఇవ్వాలని.. పీయుష్ గోయల్ వ్యాఖ్యలు రైతులను గందరగోళంలోకి నెట్టాయని మండిప‌డ్డారు.


ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మాట్లాడారా? అని నిల‌దీశారు. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చేందుకు క్లియరెన్స్ అయిందని… నలుగురు బిజెపి ఎంపిలు ఏం చేస్తున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు అయినా జాతీయ హోదా ఇప్పించారా ? అని ప్ర‌శ్నించారు.

కేసీఆర్ ను ఎలా గద్దె దింపాలని మాట్లాడటానికి ఢిల్లీ వెళ్ళారా అని ఫైర్ అయ్యారు. ఏపీలో పోలవరానికి 40 వేల కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్రం తెలంగాణ ప్రాజెక్ట్ లకు ఎందుకు ఇవ్వరని ఆగ్ర‌హించారు. బిజెపికి అధికారకాంక్ష తప్ప తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని… సీఎం కేసీఆర్ వరి వేయద్దంటే బండి సంజయ్ వరి వేయాలని అంటాడని మండిప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news