టీమిండియాకు గుడ్ న్యూస్.. మూడో టెస్ట్ కు విరాట్ కోహ్లీ రీ-ఎంట్రీ

-

సౌత్ ఆఫ్రికా తో మూడో టెస్ట్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. మూడో టెస్టు ఆడేందుకు టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సిద్దం అయ్యాడు. చాలా రోజుల తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… తను ఫిట్ గా ఉన్నానని… కేప్ టౌన్ లో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ కు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.

virat-kohli
virat-kohli

మహమ్మద్ సిరాజ్ మూడో టెస్టులో ఆడట్లేదు అని కోహ్లీ ప్రకటించారు. జట్టులో బలవంతంగా మార్పులు చేయకూడదని… కెరీర్లో ఎదుగుతున్న సమయంలో… అందరం తప్పులు చేసిన వాళ్ళ మేనని కోహ్లీ తెలిపాడు. తప్పులు అంగీకరించి సరిదిద్దుకుంటూ మనకి ఉపయోగం అన్నారు. కాగా రేపు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సౌతాఫ్రికాతో మూడో టెస్టు ప్రారంభం కానుంది. గాయం కారణంగా విరాట్ కోహ్లీ రెండో టెస్టు ఆడని సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news