బీజేపీ ప్రభుత్వ విధానం జై జవాన్… నయ్ కిసాన్- హరీష్ రావు.

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మరోసారి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం విధానం జై జవాన్.. నయ్ కిసాన్ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు మొండి చూపిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు. కరెంట్ మోటర్ల దగ్గర మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. రైతులపై బీజేపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని హరీష్ రావు విమర్శించారు. పెట్రోల్, డిజిల్ ధరలు పెంచి రైతు నడ్డి విరుస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జైకిసాన్ అన్న రీతిలో రైతుల అభివ్రుద్ది కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. బడ్జెట్ లో ఎక్కువ ఖర్చు రైతుల కోసమే చేస్తున్నామని అన్నారు. రైతులకు కులం మతం లేదని, చిన్న పెద్దా తేడా లేదని అన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులు గౌరవంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news