విరాట్​ కు మరో అరుదైన గౌరవం.. అక్కడ వాక్స్ స్టాట్యూ ఆవిష్కరణ

-

 టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా (ఏప్రిల్ 18) జైపుర్ నహర్‌ఘర్ వాక్స్ మ్యూజియంలో విరాట్ మైనపు విగ్రహాన్ని మ్యూజియం ఫౌండర్, డైరెక్టర్ అనూప్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం బరువు 35 కేజీలు ఉంటుందని అనూప్ పేర్కొన్నారు. ‘గత కొంతకాలం నుంచి పర్యాటకులు, ముఖ్యంగా పిల్లలు, యువత నుంచి విరాట్ కోహ్లీ విగ్రహాన్ని తయారు చేయాలనే డిమాండ్ ఉంది. అందుకే ఈ విగ్రహం ఏర్పాటు చేశాం’ అని తెలిపారు.

ఇవాళ్టి నుంచి ఈ విగ్రహాన్ని చూడడానికి టూరిస్ట్​లకు అనుమతి ఇచ్చారు. టీమ్ఇం డియా జెర్సీతో రెండు చేతుల్లో బ్యాట్ పట్టుకున్న విరాట్ విగ్రహం టూరిస్ట్​లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దిల్లీ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ మైనపు విగ్రహం ఉన్న విషయం తెలిసిందే.  ఈ మ్యూజియంలో ఇప్పటికే మహాత్మా గాంధీ, దలైలామా, రవీంద్రనాథ్ ఠాగూర్, భగత్ సింగ్, కల్పనా చావ్లా, జాకీ చాన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, ఫుట్​బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ వంటి 44 మంది ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news