బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. పథకాల విషయంలో అందరూ సమానమేనని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ.. ట్రాక్టర్ నడుపుతున్న ఓ ముస్లిం వ్యక్తిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదని.. మేము ప్రవేశపెట్టిన ఏ పథకంలోనైనా అందరినీ సమానంగా పరిగణిస్తామని వెల్లడించారు.

ఉచిత రేషన్ ఇచ్చినా, బ్యాంకు ఖాతాలు ఇచ్చినా ఏది ఇచ్చినా అందరికీ సమానంగా ఇచ్చామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో 40లక్షల మందికి ఇళ్లు ఇస్తే.. అందులో 31 శాతం ముస్లింలకు కేటాయించబడ్డాయని తెలిపారు. ప్రధానంగా 20వేల నుంచి 20లక్షల వరకు అవసరమైన వారికిి ముద్ర రుణాలు అందించబడ్డాయని.. అందులో 36 శాతం రుణాలు ముస్లింలకు ఇవ్వబడ్డాయని తెలిపారు. కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటే.. బీజేపీ ముస్లింలను ఆదుకుంటుందని తెలిపారు. మోడీ మరోసారి దేశ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news