కలుషితమైన ఆహరం తీసుకున్న 70 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలు..

-

తెలంగాణ రాష్ట్రము వనపర్తి జిల్లాలోని అమరచింత KGBV లో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎప్పటిలాగే ప్రభుత్వ మెనూ ప్రకారం నిన్న రాత్రి ఈ హాస్టల్ చదువుతున్నా విద్యార్థినులకు వంకాయ తో చేసిన సాంబారుతో పెట్టారు. అందరూ తిని పడుకున్నారు.. కానీ దాదాపుగా రాత్రి 11 గంటల సమయంలో కొందరి అమ్మాయిలకు కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో… వారిని ఈ రోజు ఉదయం ఆత్మకూరు లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ హాస్పిటల్ లో మొత్తం 70 మంది విద్యార్థినులు చికిత్సను తీసుకుంటున్నారు. డాక్టర్లు చెబుతున్న ప్రకారం కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వలెనే కడుపునొప్పి వచ్చిందట. కొంచెంలో చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయింది, ఆ రాత్రి సమయంలో ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులు అంటూ పిల్లల తల్లితండ్రులు ఆవేదన చెందారు.

ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఇపుడు జరిగిన ఏ తప్పిదం మళ్ళీ జరగాకుండా చూసుకోవాలని తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news