కోహ్లీకి షాక్…ఐపీఎల్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్‌

-

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్… చేతి వేలి గాయం కారణంగా.. ఐపీఎల్ 2021 రెండోదశ మ్యాచ్ లకు పూర్తిగా దూరమయ్యాడు. ఆర్సిబి కీలక ఆటగాళ్లలో ఒకడైన సుందర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో ఆ జట్టు పై ప్రభావం పడుతుంది. సుందర్ స్థానంలో బెంగాల్ బౌలర్ ఆకాష్ దీప్ కు ఛాన్స్ ఇచ్చింది ఆర్ సి పి యాజమాన్యం.

ప్రస్తుతం ఆకాష్ దీప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్యాంప్ లో నెట్ బౌలర్ గా ఉన్నాడు. ఇక అంతకు ముందు సుందర్ ఇదే చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లాండ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలగిన సంగతి విధితమే. కాగా యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 రెండోదశ మ్యాచులు సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని జట్లు దుబాయ్ చేరుకుని ప్రాక్టీస్ మ్యాచ్ లో నిమగ్నమై ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 19న మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news