ఎల్లుండి ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

-

ఎల్లుండి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజధాని ఢిల్లీ కి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ఉండనుంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 1, 2021 మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్.

సెప్టెంబర్ 2, 2021 మధ్యాహ్నం 12:30 గం. ల నుంచి ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ చేయనున్నారు ముఖ్యమంత్రి. ఇక సీఎం కేసీఆర్ తో పాటు భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు , పార్టీ నాయకులు పాల్గొననున్నారు.

ఢిల్లీ లోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 1300 ల గజాల స్థలాన్ని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇక భూమి పూజ కార్యక్రమం అనంతరం  సెప్టెంబర్ 3, 2021 మధ్యాహ్నం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్ళిన సిఎం కెసిఆర్ మళ్ళీ.. సెప్టెంబర్ 1 వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news