భారత్ తో ఈ వన్డే సిరీస్ ని సీరియస్ గా తీసుకుంటున్నాం – టామ్ లాథమ్

-

భారత్ తో ఈ వన్డే సిరీస్ ని సీరియస్ గా తీసుకుంటున్నామని అన్నారు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్. వరల్డ్ కప్ కి ముందు జరిగే మ్యాచ్… అందులోనూ ఇండియాలోనే వరల్డ్ కప్ జరగబోతోంది కాబట్టి మాకు ఈ సిరీస్ ముఖ్యమైనదిగా భావిస్తున్నాం అన్నారు. విలియమ్సన్, సౌతీ లేకపోవడంతో యంగ్ ప్లేయర్స్ కి అవకాశం లభించిందని.. ఇది కూడా మంచి పరిణామం అన్నారు.

పాకిస్థాన్ తో 2-1 తేడాతో గెలిచామని… అక్కడ కూడా ఏషియన్ కండిషన్స్ కాబట్టి అది కూడా మాకు అడ్వాంటేజ్ అయ్యిందన్నారు. ఇండియాలో పిచ్ లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటాయని.. పిచ్ కు తగ్గట్టు రాణించే టీం మాతో ఉందన్నారు. అందరం ఐపీఎల్ లో కలిసే ఆడాం కాబట్టి ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటో మాకు తెలుసన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news