నడ్డా సొంత రాష్ట్రంలో బిజెపిని ఓడించాం – మల్లు రవి

-

జేపీ నోటా సొంత రాష్ట్రంలో బిజెపిని ఓడించగలిగామన్నారు పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి. బిజెపికి ఐడియాలజీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖరిగే రబ్బరు స్టాప్ అంటూ బిజెపి చేసిన విమర్శలను మల్లు రవి ఖండించారు. బిజెపిలో మోదీ, అమిత్ షా తప్ప మిగతా వాళ్లంతా రబ్బర్ స్టాంపులు కాదా? అని ప్రశ్నించారు.

బిజెపిది దళిత వ్యతిరేక ధోరణి అని విమర్శించారు. నేడు సాయంత్రం దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వస్తున్నారని.. సీనియర్ నాయకులతో సమావేశం ఉంటుందని మల్లు రవి పేర్కొన్నారు. స్వతంత్ర ఉద్యమంలో బిజెపి నాయకులు లేరంటూ.. మల్లికార్జున ఖర్గే కూడా అదే చెప్పారని.. ఈ విషయాన్ని మాట్లాడితే బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు మల్లు రవి. ఖర్గే రాజకీయాలలో అంచలంచలుగా ఎదిగిన నాయకుడని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news