రెండున్నరేళ్లలో రూ.50వేల కోట్ల పనులు చేస్తాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

-

రాబోయే రెండున్నరేళ్లలో రూ.50వేల కోట్ల వరకు పనులు చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాళ కేంద్ర కేబినెట్ అమరావతి రైల్వే లైన్ ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఏపీలో చేపట్టబోయే పలు ప్రాజెక్ట్ ల గురించి వివరించారు.

ముఖ్యంగా ఏపీలో చేపట్టబోయే అన్ని ప్రాజెక్టులకు మరో మూడు నెలల్లోనే భూ సేకరణ పూర్తి చేయనున్నట్టు.. ఈ మేరకు అధికారులకు ఉత్వర్వులు కూడా జారీ చేసామని తెలిపారు. రూ.18వేల కోట్లతో చేపడుతున్న బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్ ప్రెస్ కారిడార్ లో కొన్ని సమస్యలున్నాయని తెలిపారు. అయినప్పటికీ వాటిని అధిగమించి.. నిర్ణీత గడువు లోపు పనులను పూర్తి చేస్తామని ప్రకటించారు. 15 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి పర్యావరణ అనుమతులు సాధిస్తామని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 636 కి.మీ.ల గ్రీన్ ఫీల్డ్ రోడ్లు చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news