అనుభ‌వ‌జ్ఞుడైన శ‌ర‌ద్ ప‌వ‌ర్‌తో క‌లిసి ప‌ని చేస్తాం : కేసీఆర్

-

ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వ‌ర్.. ఎంతో అనుభ‌వ‌జ్ఞుడు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. కాగ నేడు కేసీఆర్ ముంబై ప‌ర్య‌ట‌నలో ఉన్న విషయం తెలిసిందే. ముంబై ప‌ర్య‌ట‌న‌లో ముందుగా మ‌హా రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌శ్ ఠాక్రే తో స‌మావేశం అయ్యారు. ఆయ‌న‌తో స‌మావేశం ముగిసిన అనంత‌రం.. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వ‌ర్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. స‌మావేశం అనంత‌రం కేసీఆర్.. శ‌ర‌ద్ ప‌వ‌ర్ సంయుక్తంగా మీడియా స‌మ‌వేశం నిర్వ‌హించారు.

భావ సారూప్య‌త ఉన్న పార్టీల‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని కేసీఆర్ అన్నారు. అందులో భాగంగా అనుభ‌వ‌జ్ఞుడైన శ‌ర‌ద్ ప‌వ‌ర్ తో క‌లిసి పని చేయ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని కేసీఆర్ అన్నారు. కాగ తాను శ‌ర‌ద్ ప‌వ‌ర్ తో దేశ రాజ‌కీయాల గురించే చర్చించాన‌ని అన్నారు. అలాగే శ‌ర‌ద్ ప‌వ‌ర్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చేసిన ఉద్యామానికి పూర్తి స‌హాకారం చేశార‌ని కేసీఆర్ గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news