ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు

-

ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మీద నున్న తుఫాను జవాద్ ,ఉత్తర వాయవ్య దిశగా గత 6 గంటల్లో గంటకు 6 కి మీ వేగం తో ప్రయాణించి ఈ రోజు డిసెంబర్ 4 వ తేదీ 8 గంటల 30 నిముషాలకు 16 . 4 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 84 . 8 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై, విశాఖపట్నంకు తూర్పు ఆగ్నేయముగా 210 కిలోమీటర్లు దూరములో ఉంది.

గోపాల్ పూర్(ఒడిశా ) కు దక్షిణ ముగా 320 కిలోమీటర్లు దూరములో, పూరి (ఒడిశా ) కు దక్షిణ నైరుతిగా 390 కి మీ దూరము లో పరాదీప్ (ఒడిశా ) కు క్షిణ నైరుతిగా 470 కిలోమీటర్లు దూరములో ఉన్నది. ఈ తుఫాను రాగల 12 గంటలలోక్రమము గా బలహీన పడి , ఉత్తర దిశగా ప్రయాణించి, ఆ తరువాత ఉత్తర ఈశాన్య దిశగా ఒడిస్సా తీరము వెంబడి ప్రయాణిం చి పూరి (ఒడిశా ) దగ్గర కు డిసెంబర్ 5 వ తేదీ మధ్యాన్నానికి తీవ్ర వాయుగుడం గాచేరుతుంది.

తదుపరి మరింత బలహీన పడి ఉత్తర ఈశాన్య దిశగా ఒడిశా కోస్తా వెంబడి ప్రయాణం కొనసాగించి పశ్చిమ బెంగాల్ తీరం వైపుకు వెళ్లే అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వ ర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా…. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news