పెళ్లి నాటకం.. రూ.6.50 కోట్లు కొల్లగొట్టిన కి‘లేడీ’

-

పెళ్లి సంబంధాలు చూడాలని ఓ యువకుడు మ్యాట్రిమోనిని ఆశ్రయించాడు. పెళ్లి పేరుతో ఓ యువతి ఆ యువకుడికి చుక్కలు చూపించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి ఆస్తిపై కన్నేసిన ఆ యువతి మ్యాట్రిమోనిలో పని చేస్తుంటుంది. ఆ యువతి పేరు రీనా. యువకుడి ఆస్తి ఎలాగైనా కాజేయాలని పెళ్లి నాటకం ఆడింది. పెళ్లికి ముందే తనకు తెలిసిన ఓ కంపెనీలో రూ.6.50 కోట్లు పెట్టుబడి పెట్టించుకుంది. ఆ తర్వాత దూరమైంది. దీంతో తనను ఎందుకు మోసం చేశావని ప్రశ్నించినందుకు ఆ యువకుడిని రౌడీలతో కొట్టించింది. దీంతో బాధితుడి సోదరి పోలీసులను ఆశ్రయించింది.

పెళ్లి-మోసం
పెళ్లి-మోసం

హైదరాబాద్‌లో నివాసముంటున్న రవికుమార్ రెండేళ్లుగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మ్యాట్రిమోని ద్వారా రీనా గొర్లె అనే యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త పెళ్లి దాక వెళ్లింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రీనా, రవికి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత రీనా అసలు రూపం బయటపడింది. ఆస్తిపై కన్నేసిన రీనా తనకు తెలిసిన కంపెనీలో పెట్టుబడి పెట్టించి.. ఆ తర్వాత తనకు దూరమవ్వాలని ప్రయత్నించింది. దీంతో రవికుమార్ సోదరి పద్మజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news