ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్  పంజాబ్ సూపర్ కింగ్స్ 176 పరుగులు సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 45 మినహా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ పెద్దగా స్కోరు చేయలేదు. 

జితేష్ శర్మ (27), సామ్ కరణ్ (23), ప్రభు సిమ్రాన్ సింగ్ (25), పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరు కే పరిమితమయ్యారు. మహ్మద్ సిరాజ్, మ్యాక్స్ వెల్ రెండేసి వికెట్లు తీయగా.. జోసెఫ్, దయాల్ చెరో వికెట్ తీశారు. చివరి ఓవర్ లో జోసెఫ్ బౌలింగ్ లో శశాంక్ 6,6,4,2, పరుగులు చేయడంతో పంజాబ్ 176  పరుగులు సాధించింది. ఆర్సీబీ  177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 177 పరుగులు ఛేదిస్తుందో లేదో వేచి చూడాలి మరీ. 

Read more RELATED
Recommended to you

Latest news