బెజవాడ పశ్చిమ సీటు పై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

-

బెజవాడ పశ్చిమ సీటు పై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు పశ్చిమ సీటు కూటమి బీసీ వ్యక్తికి ఇచ్చామని చెప్పింది. పేద బీసీ వ్యక్తిని కాదని.. బీజేపీ నుంచి ధనికుడికి ఇప్పుడు టికెట్ ఇస్తున్నారని టీడీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు పశ్చిమలో తన కుమార్తె శ్వేత పోటీ చేయదుఅని ప్రకటించానన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు పశ్చిమ సీటు మైనార్టీ లేదా బీసీలదేనని చెప్పారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీలను కాదని చార్టెడ్ ఫ్లైట్ లో తిరిగే వ్యక్తికి పేదలు ఉండే పశ్చిమ సీటును కూటమి నిలబెడుతోందని కేశినేని నాని విమర్శించారు. బీజేపీలకు పశ్చిమ సీటు ఇవ్వటమే పొరపాటు అని ఆరోపించారు. రెండేళ్లు కేంద్రమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయని వ్యక్తిని ఇక్కడ ఎందుకు నిలబెడుతున్నారో ప్రజలకు తాము చెప్పాలన్నారు. అన్ని రకాలుగా తమను ఇబ్బంది పెట్టాలని చేస్తారని.. వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి ఇక్కడ అభ్యర్థిగా వస్తున్నాడు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కేశినేని నాని పేర్కొన్నారు.మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. అధికారికంగా ఆయన పేరును ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆ పార్టీకి కేటాయించిన అసెంబ్లీ నియోజక వర్గాలపై బీజేపీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news