సంజు శాంసన్ ను ఆస్ట్రేలియా సిరీస్ కు అందుకే ఎంపిక చేయలేదు?

-

ఇండియా వరల్డ్ కప్ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఇంతలోనే ఆస్ట్రేలియా తోనే ఇండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఆడనుంది. ఈ సిరీస్ నవంబర్ 23 నుండి డిసెంబర్ 3 వరకు జరగనుంది అయిదు డిఫెరెంట్ వేదికలలో జరగనుంది. కాగా ఈ సిరీస్ కు బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించిన జట్టులో మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ సంజు శాంసన్ కు మళ్ళీ మొండిచెయ్యి చూపారు. ఇప్పటికే సంజు శాంసన్ ను వరల్డ్ కప్ కు ముందు జరిగిన టీ 20 వరల్డ్ కప్, ఆసియా కప్, ఆసియన్ గేమ్స్ ఇలా అన్నిటిలోనూ అన్యాయమే జరిగిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్ కు ప్రకటించిన జట్టులోనూ చోటు దక్కలేదు. ఇందుకు కారణం ఏమై ఉంటుందని సోషల్ మీడియా లో నెటిజన్లు అడుగుతున్నారు.

ఇందుకు తెలుస్తున్న సమాచారం ప్రకారం గత నెలలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో సంజు శాంసన్ సరైన ప్రదర్శన చేయకపోవడం వలనే జట్టులో చోటివ్వలేదు అంటూ చెప్పుకుంటున్నారు. కానీ కనీసం బీసీసీఐ కి అయినా క్లారిటీ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news