చాహల్ ను అందుకే రిటైన్ చేసుకోలేదు: మైక్ హసన్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 సీజన్లో ముగ్గురినే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో యుజ్వేంద్ర చాహల్ను రిటైన్ చేసుకోలేకపోయామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ డైరెక్టర్ మైక్ హాసన్ తెలిపారు. ‘వేలంలో చాహల్ పేరు ఆలస్యంగా రావడంతో అక్కడ కూడా ఆయనను దక్కించుకోలేకపోయాం.ఆయన వేలంలోకి రాకముందే హసరంగను తీసుకున్నాం అని అన్నారు.చాహల్తోపాటు హర్షల్ను కూడా దక్కించుకోలేకపోయాం’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, నిన్న ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా యుజ్వేంద్ర చాహల్ రికార్డు సృష్టించారు. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచులో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 153 మ్యాచులు ఆడిన చాహల్ గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయలు తరుపున ఆడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version