బాలు అంత్య క్రియలు.. వారి గైర్హాజరు చర్చనీయాంశం..?

-

ఇటీవలే భారత సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పరిశ్రమని వదిలేసి స్వర్గసీమ కు పయనమైన విషయం తెలిసిందే. ఎస్పీ బాలు అంత్యక్రియలు చెన్నైలో ముగిసాయి. కాగా ఎస్పీ బాలు అంత్యక్రియలకు సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది మాత్రమే హాజరయ్యారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కమల్హాసన్ రజనీకాంత్ లాంటి వాళ్ళు బాలు మృతదేహాన్ని చూసి తాము తట్టుకోలేము అంటూ అంత్యక్రియలకు వెళ్లలేదు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కేవలం హీరో విజయ్ మాత్రమే హాజరయ్యారు.

అయితే టాలీవుడ్ ప్రముఖులు మాత్రం బాలు అంత్యక్రియల్లో కనిపించలేదు. దీంతో ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో ఏళ్ల పాటు సేవలు చేసిన బాలు అంత్యక్రియలకు తెలుగు సినీ ప్రముఖులు పెద్దగా హాజరుకాకపోవడంపై… చర్చ నడుస్తుంది. అయితే కరోనా వైరస్ దృశ్య భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని.. బాలు అంత్యక్రియలకు వెళ్ళలేదు అని తెలుగు సినీ ప్రముఖులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news