ఆంటీ అని పిలిస్తే అనసూయ కి ఎందుకంత కోపం..?

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ రేంజ్ లో పరుగులు తీస్తున్న యాంకర్ అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదిగి మంచి గుర్తింపు అందుకున్న అనసూయ తన మాటలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ముఖ్యంగా జబర్దస్త్ లో తను వేసిన డాన్స్ లకు , గ్లామర్ షో కి మాత్రం యువత ఆమెకు మోహితులయ్యారు. మొత్తానికి బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తను ఏంటో నిరూపించుకుంది. ఈమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అనసూయ అందంలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పటికి అదే గ్లామర్…ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను మరియు డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. కావున ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడంతో అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.ఈమెకు బాగా నెగిటివ్ ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. గతంలో వీటిని అసలు పట్టించుకోకుండా ఉండేది. ఇక ఈ మధ్య ఈమెపై మరింత ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఆంటీ అంటూ ఓ రేంజ్ లో ఈమెను బాగా ఆడుకుంటున్నారు. దీంతో అనసూయ ఇప్పుడు ట్రోలర్స్ను వదిలేయట్లేదు.

ఇటీవలే తనపై ట్రోల్ చేసిన వ్యక్తిని కూడా అరెస్టు చేయించి బాగా రచ్చ చేసింది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఉన్న ఇంస్టా వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చటించింది.అందులో తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పింది. అయితే ఓ నెటిజన్ “అక్క మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది” అని అడగ్గా వెంటనే అనసూయ ఈ విధంగా స్పందించారు.ఎందుకంటే వాళ్ళ అర్థాలు వేరే ఉంటాయి. నాకు కోపం వచ్చింది. ఏదైతే ఏంటి.. ఇప్పుడు అంత కోపం రావట్లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా అంటూ సమాధానం ఇచ్చింది.ప్రస్తుతం ఆమె ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news