నంది కొమ్ము లో నుండి ఎందుకు శివుడిని దర్శనం చేసుకోవాలి..?

-

ఏదైనా ఆలయానికి వెళ్లి అక్కడ కాసేపు గడిపితే ఎంతో అనందం ఉంటుంది. చాలా ప్రశాంతంగా మనం ఉండచ్చు. అందుకే చాలా మంది ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ వుంటారు. అయితే ఏ టెంపుల్ కి వెళ్లినా కూడా మనం దేవుడి ని నేరుగా దర్శించుకుంటూ ఉంటాము. కానీ శివుడి ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం నేరుగా కాకుండా నంది కొమ్మల మధ్య నుండి శివుడిని చూస్తాము. అలా చూడాలని పెద్దలు చెప్తూ ఉంటారు.

ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తర్వాత గంట మోగించి ఆ తర్వాత దేవుడిని దర్శించుకుంటారు. శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ముందు నంది దగ్గరికి వెళ్లి నంది కొమ్ముల మధ్య లో నుండి శివుడి విగ్రహాన్ని చూడమని అంటారు. అసలు ఎందుకు నంది కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని చూడాలి దాని వెనక కారణం ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. త్రిమూర్తుల్లో పరమేశ్వరుడు ఒకరు. ఆయనకి విగ్రహరూపం ఉండదు.

శివుడు ని లింగ రూపంలో మనం దర్శించుకోవాలి. ఆయన లయకారుడు. తన మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. అంతటి శక్తి ఉంది కాబట్టి శివుడిని డైరెక్టుగా మనం దర్శించుకోకూడదు. దర్శించుకుంటే అరిష్టం కలుగుతుందని అంటారు కాబట్టి ముందు శివుడికి ఎదురుగా ఉన్న నంది కొమ్ముల మధ్య లో నుండి శివుడుని చూడాలి నంది చెవిలో కోరికలు చెప్తే ఆ కోరికలు నెరవేరుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news