మహబూబ్ నగర్ లో కల్తీకల్లు కలకలం.. 10 మందికి తీవ్ర అస్వస్థత

-

మహబూబ్ నగర్ లో కల్తీకల్లు కలకలం సృష్టించింది. కల్తీ కల్లు తాగి పదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్నగర్ పట్టణంలోని మోతీ నగర్, బొక్కల్లోనిపల్లి తదితర ఏరియాలకు చెందిన పలువురు స్థానికంగా ఉన్న దుకాణంలో కల్లు సేవించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

క్లోరోఫామ్ తో కల్లు తయారు చేసి విక్రయిస్తున్నారని, ఆ కళ్ళు తాగిన వ్యక్తులు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే కల్తీ కల్లు తయారీ జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కల్తీకల్లు విక్రయాలు జరిపిన వారిపై ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news