కరోనా వచ్చిందని భార్యా, భర్త సూసైడ్

-

కరోనా మహమ్మారి ఎన్నో జీవితాలను నాశనం చేస్తోంది. ఇప్పటికే కరోనా సోకి ఎన్నో కోట్ల మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కరోనా సోకినా 90 శాతం మంది కోలుకుని బయటకు వస్తోంటే పది శాతం మంది అనేక కారణాల వలన కన్ను మూస్తున్నారు. తాజాగా జగిత్యాల పట్టణం శివవీధిలో దంపతులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గంజి రాంబాబు, లావణ్య అనే దంపతులు ఇద్దరూ తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.

దంపతులకు గత రెండు రోజుల క్రితం కరోన పాజిటివ్ అని తేలిందని సమాచారం అందుతోంది. అయితే తమను ఎవరూ పట్టించుకోవడం లేదని భావించి చనిపోయారా ? లేక కరోనా అని భయంతో చనిపోయారా ? అనేది తేలాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలానే అసలు ఈ ఘటనకు కారణం ఏమిటి అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news