కళ్యాణ్ రామ్ అమిగోస్ తో ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ చేస్తాడా..?

-

నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్నాడని చెప్పాలి. బింబిసారా సినిమాతో స్టార్ హీరో అయిపోయిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఏకకాలంలో రెండు సినిమాలను చిత్రీకరిస్తూ బిజీ అయిపోయాడు. ఒకటి డెవిల్ అనే పీరియాడిక్ మూవీలో నటిస్తుండగా.. మరొకటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బింబిసార సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ చిత్రంలో త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. నిజానికి ఇప్పటి జనరేషన్ హీరోలలో డ్యూయల్ రోల్ చేయాలంటే కత్తి మీద సాము లాంటిది. అలాంటిది త్రిపాత్రాభినయం చేయాలి అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. కేవలం ఎన్టీఆర్ మాత్రమే జై లవకుశ సినిమా ద్వారా త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించాడు.

అంతేకాదు ఈతరం హీరోలలో త్రిపాత్రాభినయం చేసిన ఏకైక హీరోగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే ఆ రికార్డును బ్రేక్ చేయడానికి ఇప్పుడు తన అన్న కళ్యాణ్ రామ్ కూడా సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాను నటిస్తున్న అమిగోస్ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల సిద్దార్థ్ – డొప్పెల్ గ్యాంగర్ -1 అంటూ సినిమాలోని కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ను పరిచయం చేసింది చిత్ర యూనిట్. అయితే ఇవాళ మంజునాథ్ – డొప్పెల్ గ్యాంగర్ -2 అంటూ మరో పాత్రను రివీల్ చేయడం జరిగింది. అయితే డొప్పెల్ గ్యాంగర్ అంటే ఏంటో తెలియక చాలామంది గూగుల్ సెర్చ్ చేసారు. దీంతో మేకర్ డొప్పెల్ గ్యాంగర్ అంటే ఏంటో ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది.

డొప్పెల్ గ్యాంగర్ అంటే “మనిషిని పోలిన మనుషులు” అని అర్థం అంటూ చెబుతూ ఇప్పుడు మూడో డొప్పెల్ గ్యాంగర్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అంటూ ట్వీట్ కూడా చేశారు చిత్ర నిర్మాతలు. దీన్ని బట్టి చూస్తే ఇందులో మూడు పాత్రలలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news