టాలీవుడ్ మీడియాను సమంత ఫేస్ చేస్తుందా..?

-

ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ వీరి వివాహ బంధం ఎంతో కాలం నిలబడలేదు. పెళ్లి జరిగిన నాలుగేళ్లకే ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక విడాకుల తర్వాత సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టిన సమంత తెలుగు , హిందీ భాషలలో సినిమాలు చేస్తూ.. మంచి క్రేజ్ దక్కించుకుంటుంది. ఇకపోతే నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో సమంత ఏం షేర్ చేసినా సరే అది బాగా వైరల్ గా మారింది. అంతేకాదు ఈమెపై ఎక్కువగా ట్రోల్స్ కూడా జరిగాయి. ఇక ఆ తర్వాత ఆమె మళ్ళీ ఇప్పటివరకు టాలీవుడ్ మీడియా ముందుకు రాలేదు. అంతేకాదు ఎయిర్పోర్ట్ లేదా ఎక్కడైనా సరే మీడియా వాళ్ళు కనిపించినా.. వాళ్ళు అడిగే ప్రశ్నలను స్కిప్ చేస్తూ వెళ్ళింది.

అయితే ఇదిలా ఉండగా సమంత నటిస్తున్న యశోద సినిమా నవంబర్ 11వ తేదీన రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత టాలీవుడ్ మీడియాని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక తప్పకుండా సమంతకి సినిమాకు సంబంధించిన ప్రశ్నలే కాకుండా పర్సనల్ ప్రశ్నలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ ప్రశ్నలను సంధించే మీడియాను సమంత ఫేస్ చేస్తుందా? అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి వారు అడిగే ప్రశ్నలకు సమంత సమాధానం చెబుతుందా? లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇక యశోద సినిమాను హరి హరీష్ దర్శక ద్వయం డైరెక్ట్ చేస్తున్నారు . ఇక సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే సమంత మొదటిసారి నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం కూడా త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news