చంద్రబాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

బాబును చూడాలి అంటూ కాన్వాయ్ వెంట ఓ మహిళ పరుగులు పెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ – కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చాడు. కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి, ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు.

తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పి.. చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానని చెప్పగా.. బాబు ఆ ఆ మహిళను చూసి ఎమోషనల్ అయ్యారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి.. మా కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్, ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా, చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చానని నందిని చెప్పగా, ముందు ఆసుపత్రికి వెళ్లు అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని, అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news