హైదరాబాద్ : అర్థనగ్నంగా కూర్చోవాలి..మూత్రం తాగాలంటూ భర్త వేధింపులు..చివరికి…!

-

ప్రేమించి పెళ్లాడిన భ‌ర్త కొద్దిరోజుల‌కే వేధింపులు మొద‌లు పెట్ట‌డం మొద‌లు పెట్టాడు. క‌ట్నం తేవాలంటూ శాడిష్ట్ లా ప్ర‌వ‌ర్తించ‌డం..వేధించడంతో రూ.1.50 ల‌క్ష‌లు ఇచ్చింది. అయినా వేధింపులు త‌ప్ప‌లేదు. దాంతో చివ‌రికి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఈ ఘ‌ట‌న బంజారిహిల్స్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో చోటు చేసుకుంది. నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్త‌ల్ కు చెందిన ఓ మ‌హిళ ర‌హ‌మ‌త్ న‌గ‌ర్ కు చెందిన ఓ యువ‌కుడిని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర‌వాత ఆమె గ‌ర్భం దాల్చ‌గా అత్తింటివారు ఆప‌రేష‌న్ చేయించారు.

ఆ త‌ర‌వాత వేధింపులు మొద‌ల‌య్యాయి. క‌ట్నం తేవాంలంటూ అత్తింట్లో అంద‌రూ వేధింపులకు గురి చేయ‌డంతో ల‌క్షా యాభై వేల‌ను తీసుకువ‌చ్చి ఇచ్చింది. అయినా వేధింపులు త‌ప్ప‌క‌పోగా భ‌ర్త శాడిస్ట్ లా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లు పెట్టాడు. శారీర‌కంగా హింసించ‌డం..అర్థ న‌గ్నంగా కూర్చోవాల‌ని..మూత్రం తాగాల‌ని సైకోలా ప్ర‌వ‌ర్తించ‌డంతో చివ‌రికి ఆ మహిళ పోలీసులను ఆశ్ర‌యించింది. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయ‌డంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news