స్త్రీలు కచ్చితంగా పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలట… సర్వైకల్ క్యాన్సర్ కు ప్రికాషన్

-

స్త్రీలల్లో ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్( Cervical Cancer), గర్భాశయ క్యాన్సర్(Ulterine cancer) వస్తాయి. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ప్రీకాషన్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా రక్షించుకోవచ్చు. 21 సంవత్సరాల వయసు పై బడినప్పటి నుంచి.. 65 ఏళ్ల వరకూ ప్యాప్ స్మియర్ (pap smear) అనేది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలని అమెరికన్ క్యాన్సర్ అసోసియోషన్ వారు చెప్తున్నారు. ఇలా టెస్ట్ చేయించుకోవడం వల్ల ఆ భాగాల్లో క్యాన్సర్ డవలప్ అవుతుందా.? అసలు ఆ భాగాల్లో వాతావరణం ఎలా ఉంది అనేది ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది.
ముఖ్యంగా పాప్ స్మియర్ పరీక్ష అనేది.. గర్భశాయ ముఖం ద్వారాం.. సర్వైకల్ భాగంలో క్యాన్సర్ స్థితని తెలియజేస్తుంది. ఈ పరీక్షను 21ఏళ్ల లోపు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏదైన ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటే.. తప్పనిసరిగా చేయించుకోవాలి. వారసత్వంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నవారు, స్టిరాయిడ్స్ ఎక్కువకాలం నుంచి వాడేవాళ్లు, ఆటోఇమ్యున్ డిసార్డర్స్ వాడేవారు, ఆ భాగాల్లో తరచూ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బందిపడేవారు, HIV, HPV సోకినవారు, స్మోకింగ్ ఎక్కువగా చేసే స్త్రీలు కచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఇతరులకు ఇలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఏమైనా డౌట్ ఉంది అంటే.. మూడేళ్లకు ఒకసారి చేయించుకోవాలి.

ఈ టెస్ట్ ను ఎలా చేస్తారంటే..

అంటే మీకు ముందే ఒక ఐడియా ఉంటే.. టెస్ట్ కు వెళ్లినప్పుడు ఇబ్బంది పడకుంటా ఉంటారు. ఈ టెస్ట్ కాస్త ఆక్వాడ్ గానే ఉంటుంది. గర్భాశయ ముఖద్వారం సర్విక్స్( Cervix) దగ్గర టెస్ట్ పరికరంతో రాపిడి చేస్తారు. దానితో ఆ ముఖం ద్వారా దగ్గర కొంత కణజాలం ఈ పరికరానికి అంటుకుంటుంది. అప్పుడు అది తీసేసి.. టెస్టులకు పంపుతారు. ఆ పరీక్షల్లో క్యాన్సర్ ఏమైనా ఉందా, సర్విక్స్ హెల్దీగా ఉందా, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అనేది క్లియర్ గాచేస్తారు. సింపుల్ గానే అవుతుంది.
ఇలాంటివి చేయించుకోవడం వల్ల క్యాన్సర్ ను ముందే గుర్తించి.. తగిన చికిత్స చేయించుకోవచ్చు. క్యాన్సర్ లక్షణాలు బాగా పెరిగిపోయి..టఫ్ స్జేజీలోనే బయటపడుతుంది. ఈరోజుల్లో చాలామందిలో ఇదే జరుగుతుంది. కాబట్టి.. ముందే ఇలాంటి పరీక్షల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. ఇంకొక విషయం..ఎవరైతే గర్భాశయం తొలగించుకుని ఉంటారో.. అలాంటి వారు ఈ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. 65 సంవత్సరాలు పైబడిన వారికి కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు.. కాబట్టి.. వారు కూడా పరీక్ష చేయించుకోవాలస్సిన అవసరం ఉండదు.
ఎవరికైనా ఆ భాగంలో లైట్ గా ఇప్పుడే స్టాటింగ్ స్టేజ్ లో క్యాన్సర్ ఉందిని తేలితే.. దాన్ని ఇంకా త్వరగా తగ్గించుకోవాడనికి, ట్రీట్మెంట్ తో పాటు.. నాచురల్ డైట్ మీద కూడా కాస్త ఫోకస్ పెడితే.. తేలిగ్గా ఇందులోంచి బయటపడొచ్చు. వీటి గ్రాస్ జ్యూస్ ఇలాంటివారికి అద్భుతంగా పనికొస్తుంది. రోజుకు రెండుమూడు కప్పులు వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే చాలు. 100-150 ml చొప్పున తీసుకుని దానకి తేనె, ఎండుఖర్జూరం పొడి కలుపుకుని తాగితే.. బ్లడ్ చేంజ్ అవుతుంది. క్యాన్సర్ సెల్స్ మీద ఫైట్ చేయడానికి, స్ప్రెడ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news