చంద్రబాబు వాట్సాప్ లో పంపిన లేఖను మీడియాకు విడుదల చేయడమే తప్ప పవన్ కు ఏం తెలుసు ? : పేర్ని నాని సెటైర్

-

చంద్రబాబు వాట్సప్, మెయిల్ పెట్టగానే ప్రింట్ అవుట్ తీసి మీడియాకు లేఖ విడుదల చేయటం తప్ప పవన్ కళ్యాణ్ కు ఏం తెలుసు?అని సెటైర్ వేశారు పేర్ని నాని.  రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం…ముఖ్యమంత్రి నాంది పలికారని…చంద్రబాబు పెద్ద పెద్ద సొరకాయలు కోస్తారన్నారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏమయ్యింది??కనీసం కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారని ఫైర్ అయ్యారు.

ఈ అంశాలు పవన్ కళ్యాణ్ కు ఎందుకు కనిపించటం లేదని…జనాభా పెరిగిపోతుంటే పాలనా సౌలభ్యం కోసం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేక పోయారు?? ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు సలహాతో ఓ లేఖ రాశారు..కొక్కునూరు ఏలూరు జిల్లాలో ఉంటే కనీస అవగాహన లేకుండా లేఖ రాశారని చెప్పారు.

పవన్ కళ్యాణ్ బరి తెగించి మాట్లాడుతున్నాడు… ఏదో బాధ్యత వహిస్తాడట అని నిప్పులు చెరిగారు. అప్పట్లో అమరావతి భూములను బలవంతంగా తీసుకుంటే నడిరోడ్డు పై ఆందోళన చేస్తానన్నారని.. లుంగీ కట్టుకుని విమానంలో వచ్చి చంద్రబాబును కలిసి అంతా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news