WORLD CUP 2023: ఫైనల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఇండియా ప్లేయర్స్ !

-

ఈ ఆదివారం గుజరాత్ అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో వన్ డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ చివరి పోరులో ఇండియా మరియు ఆస్ట్రేలియా లు పోటీ పడనున్నాయి. వందల కోట్ల మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా ఆస్ట్రేలియా లు రెండవసారి ఫైనల్ మ్యాచ్ ను ఆడుతున్నారు. ఇందుకోసం సర్వం సిద్ధం అవుతుండగా… ఇప్పటికే మోడీ స్టేడియం కు చేరుకున్న టీం ఇండియా ఈ రోజు సాయంత్రం మైదానంలో చమట చిందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియా కోచ్ ద్రావిడ్ తో కలిసి తాము ఆడనున్న పిచ్ ను పరిశీలించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ లు జడేజా, అశ్విన్, ప్రసిద్ద కృష్ణ బౌలింగ్ లో కాసేపు ప్రాక్టీస్ చేశారు. ఇక కోహ్లీ , రాహుల్, అయ్యర్ , బుమ్రా, షమీ, సిరాజ్ లు ఈ రోజు రెస్ట్ తీసుకున్నారు.

ఇక రేపు అందరు ఆటగాళ్లు శనివారం చివరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనబోతున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచి కప్ ను అందుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరొక్క రోజు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news