WORLD CUP 2023: టీం ఇండియాకు భారీ షాక్ !

-

వరల్డ్ కప్ 2023 లో ఇండియా వరుస విజయాలతో సెమీస్ వైపు దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు జరిగిన అయిదు మ్యాచ్ లలోనూ విజయాన్ని సాధించి సెమీస్ కు దగ్గరలో ఉంది. కానీ ఇండియా జట్టుకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగుళూరు లో చికిత్సను అందుకుంటున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ పటేల్ ఆద్వర్యంలోని వైద్య బృందం హార్దిక్ పాండ్యను పరిశీలించగా అంతకు ముందు కన్నా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేల్చారు. ఇదే విషయాన్నీ బీసీసీఐ లోని ఒక అధికారి చెప్పడంతో హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయట.

కానీ అధికారికంగా ఎటువంటి వార్తలు రాకపోవడం ఒక్కటే శుభపరిణామం అని చెప్పాలి. మరి హారిక పాండ్యా విషయంలో ఏమి జరుగుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news