కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ తో కివీస్ “ఢీ”… ఛేజింగ్ చేయనున్న బాబర్ ఆజం సేన!

-

వరల్డ్ కప్ లో ఈ రోజు కీలక మ్యాచ్ కాసేపట్లో స్టార్ట్ కానుంది. సెమీస్ లో ఇంకా మిగిలిన ఉన్న మూడు స్థానాల కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ ఎలిమినేట్ కాగా, ఇంగ్లాండ్, శ్రీలంక మరియు నెదర్లాండ్ లకు అవకాశాలు లేవు. బరిలో ఉన్న వాటిలో పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్గనిస్తాన్ లు ఉన్నాయి. వీటి భవితవ్యం ఈ మ్యాచ్ తో ముడిపడి ఉంది. పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో మ్యాచ్ ఆడనున్నారు. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రతి మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచినా అదృష్టాన్ని నమ్ముకోవాలి. గత మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచిన పాకిస్తాన్ ముందు ముందు మ్యాచ్ లలోనూ గెలిచి సెమీస్ కు చేరుకోవాలని తాపత్రయపడుతున్నారు.

అందులో భాగంగా కివీస్ ను ఢీకొడుతున్న పాకిస్తాన్ గెలుస్తుందా లేదా ఓడిపోయి తనతో పాటు మరో కొన్ని టీం ల ఆశలను చిదిమేస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news