WORLD CUP 2023: పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యం… బాబర్ సేన ఊదేస్తుందా !

-

వరల్డ్ కప్ లో ఈ రోజు డబుల్ హెడర్ లోని రెండవ మ్యాచ్ లో పాకిస్తాన్ ముందు శ్రీలంక ఛాలెంజింగ్ టోటల్ ను ఉంచింది. శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. ముఖ్యంగా పాక్ కీలక బౌలర్లు అయిన ఆఫ్రిది మరియు రాఫ్ లను ఒక ఆటాడుకుంది. వీరిద్దరూ భరీగా పరుగులు సమర్పించుకున్నారు. శ్రీలంక కు ఇంత స్కోర్ రావడంలో ఆ జట్టు కీలక ప్లేయర్లు అయిన మెండిస్ (122) మరియు సమరవిక్రమ (108) లు సెంచరీ లతో చెలరేగారు. వీరికి నిస్సంక (51) నుండి చక్కని సహకారం లభించింది. ఈ వరల్డ్ కప్ లో 300 కు పైగా స్కోర్ చేయడం ఏమంత కష్టం ఏమీ కాదు.

కానీ ఆ స్కోర్ ను డిఫెండ్ చేసుకోవడమే కష్టం. మరి పాకిస్తాన్ బ్యాటింగ్ యూనిట్ ఈ టార్గెట్ ను ఛేదించి టోర్నమెంట్ లో వరుసగా రెండవా విజయాన్ని నమోదు చేసుకుంటుందా లేదా శ్రీలంకకు మొదటి విజయాన్ని అందిస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news