ప్రధాని మోదీకి విదేశీ అధినేతల శుభాకాంక్షలు

-

మూడోసారి ప్రధాని పీఠం ఎక్కేందుకు రెడీ అయిన నరేంద్ర మోదీకి వివిధ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఇటలీ, భారత్​ మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడానికి, రెండు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం పరస్పర సహకారం దిశగా కలిసి పనిచేయాలని ట్వీట్ చేశారు. అమెరికా, పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల దేశాధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో సాధించిన పురోగతి, శ్రేయస్సుపై భారత ప్రజలు నమ్మకాన్ని ప్రదర్శించారని శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘె ఎక్స్‌ వేదికగా అన్నారు.

మరోవైపు మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు అభినందనలు తెలిపారు. మాల్దీవులు, భారత్​ మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కలిసి పని చేయడానికి తాను ఎదురుచూస్తున్నానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తును విజయవంతంగా పూర్తి చేసినందుకు తాము సంతోషిస్తున్నామని నేపాల్ ప్రధాని కమల్​ దహల్ ప్రచండ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news