టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

-

మహిళల ప్రీమియర్ లీగ్ చివరి మ్యాచ్ కి తేరా లేచింది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ కొట్టనుంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్‌. ఫైనల్ కు చేరిన దిల్లీ, ముంబై జట్లు ట్రోఫిని ముద్దాడెందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు, ట్రోఫిని తీసుకెళ్లనుంది. ఇక ఫైనల్ పోరులో ముంబై ముంబై ఇండియన్స్‌ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. ఢిల్లీ మాత్రం తమ జట్టులో ఒకే ఒక మార్పు చేసింది. పూనమ్‌ యాదవ్‌ స్థానంలో మిన్ను మణి తుది జట్టులోకి వచ్చింది. ఉమెన్స్ ఐపీఎల్ తరహాలోనే ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. నేడు జరిగే ఫైనల్ పోరులో ఏ జట్టు గెలుస్తుందో వేచి చూడాలి.

WPL 2023 Final, DC vs MI live: यहां देखें पल-पल का अपडेट

ముంబై ఇండియన్స్ తుది జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మ్యాథ్యూస్, యస్తిక భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమెలియా కెర్, పూజా వస్త్రాకర్, వోంగ్, కౌర్, ఖాజీ, కలిత, సైకా

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు: మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మారిజానె క్యాప్, తానియా భాటియా, క్యాప్సీ, జెస్ జొనాసెన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే,

Read more RELATED
Recommended to you

Latest news