చాలా బాధగా ఉందంటూ కంటతడి పెట్టిన మంచు లక్ష్మీ

-

నటీ, నిర్మాత మంచు లక్ష్మీ భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ ఉదయం ఇన్​స్టాలో షేర్ చేసిన వీడియోలో ఏడుస్తూ కనిపించారు. ఇంత కష్టంగా ఉంటుందని అనుకోలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంతకీ లక్ష్మీ ఎందుకు ఏడ్చారంటే..?

తన కూతురు విద్యా నిర్వాణను స్కూల్​కి పంపించడం చాలా కష్టంగా ఉందంటూ మంచు లక్ష్మీ కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం ఉదయం విద్యాను స్కూల్‌లో దింపి వచ్చిన అనంతరం ఇన్‌స్టాగ్రామ్​ స్టోరీలో ఆమె ఓ వీడియో షేర్‌ చేశారు‌. ‘లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్స్‌ మూసేసినప్పుడు పిల్లలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో 24 గంటలూ విద్యాను ఎలా తట్టుకోవాలి? అనుకున్నా. దాదాపు రెండేళ్ల నుంచి తను ఇంట్లోనే ఉండటంతో మా ఇద్దరి మధ్య అటాచ్​మెంట్​ ఎంతో పెరిగింది. చాలా రోజుల తర్వాత మళ్లీ తనని స్కూల్‌లో దింపి వస్తుంటే ఏదో తెలియని బాధ. తనకు దూరంగా ఉండటం ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. త్వరలోనే నేను దీనికి అలవాటుపడతానని అనుకుంటున్నా’ అంటూ లక్ష్మీ కంటతడి పెట్టారు.

కరోనా సమయంలో, లాక్​డౌన్​లోనూ మంచు లక్ష్మీ తన కూతురు విద్యానిర్వాణతో కలిసి ఎన్నో ఫన్నీ, ఫిట్​నెస్ వీడియోలు చేశారు. తరచూ వాళ్లిద్దరి మధ్య బంధానికి సంబంధించి.. నిర్వాణకు సంబంధించిన ప్రతి విషయాన్ని లక్ష్మీ తన అభిమానులతో షేర్ చేసుకుంటారు. యూట్యూబ్​లో చిట్టిచిలకమ్మ అని ఓ ఛానెల్​ కూడా ఉంది. ఈ ఛానెల్​లో పిల్లలకు సంబంధించిన విషయాలపై వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news