యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి!

-

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై సోమవారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్నాయి. బారాబంకి జిల్లాలోని నరేంద్రపుర మద్రహా వద్ద రెండు స్లీపర్ కోచ్‌లు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికీ తీవ్రగాయాలు అయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

రెండు బస్సులు ఢీ
రెండు బస్సులు ఢీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయన్నారు. వేగంగా వెళ్తున్న క్రమంలో చెరో బస్సులు టేక్‌ ఓవర్ చేస్తున్న క్రమంలో బస్సులు ఢీకొన్నాయన్నారు. ఈ క్రమంలో ఒక బస్సు ఎడమ భాగం పూర్తిగా ధ్వంసమైందన్నారు. మృతదేహాలను మార్చరీకి తరలించామన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news