కొత్త కేబినేట్‌ కూర్పుతో..జగన్‌ పదవీ పోవడం ఖాయం – యనమల

-

కొత్త కేబినేట్‌ కూర్పుతో..జగన్‌ పదవీ పోవడం ఖాయమని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మంత్రుల నుంచి రాజీనామాలు ఎందుకు కోరారు..? మంత్రులతో రాజీనామాలు ఎందుకు కోరారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్ తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజీనామాలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

ప్రజల దృష్టి మళ్లించేందుకు తన కీలు బొమ్మ మంత్రివర్గాన్ని బలి పశువును చేస్తున్నట్లు కనిపిస్తోందని.. అవినీతి ఆరోపణలు ఉన్నందుకు రాజీనామాలు కోరుతున్నారా..? అని ఆగ్రహించారు. ప్రతిపక్షాన్ని మరింతగా బూతులు తిట్టే మంత్రులు కావాలని కెబినెట్లో మార్పులు చేర్పులు చేస్తున్నారా..? అని నిలదీశారు.

ఇప్పటి వరకు జగన్ తన అపరిపక్వ, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని.. కొత్త కెబినెట్ కూర్పుతో జగన్ పదవీచ్యుతుడు కావడం ఖాయమన్నారు. వైసీపీని రాజకీయ బురద, అవినీతి, పతనం నుంచి బయట పడేసేందుకు మంత్రివర్గ పునర్నిమాణం ఏ మాత్రం ఉపయోగపడదని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version