కర్నూలు వైసీపీలో భగ్గుమన్న విబేధాలు…మంత్రుల ముందే బాహాబాహి !

-

కర్నూలు జిల్లా వైసీపీలో విబేధాలు భగ్గుమన్నాయి…మంత్రుల ముందే బాహాబాహికి దిగారు నేతలు.  పంచాయతి ఎన్నికల గురించి వైసీపీ కీలక సమావేశంలో నేతలు బాహాబాహికి దిగడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ మంత్రులు బొత్సా సత్యనారా యణ,  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యేలు పాల్గొన్న సమావేశంలో కుర్చీలతో కొట్టుకునేందుకు ద్వితీయ శ్రేణి నేతలు యత్నించడం సంచలనంగా మారింది.

నందికొట్కూరు నియోజకవర్గంలో సర్పంచి అభ్యర్ధుల ఎంపిక విషయంలో బైరెడ్డి సిధార్థరెడ్డి అనుచరులు ఎమ్మెల్యే ఆర్థర్ అనుచరులు బాహాబాహికి దిగినట్టు చెబుతున్నారు. మంత్రులు అందరూ అక్కడే ఉండడంతో వారిని వారించారు. చివరికి పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటికప్పుడు విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. అయినా అధిష్టానం పట్టించుకోక పోవడంతో ఎప్పుడూ ప్రజల ముందు చులకన అవుతున్నారు నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news