ఎంసెట్ కౌన్సెలింగ్ ని కూడా డామినేట్ చేస్తున్న వైసీపీ…?

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు కొందరి తీరుపై ఇప్పుడు వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా అనంతలో జెఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కు అధికార పార్టీ నేతల బెదరింపుల వ్యవహారం సంచలనం అయింది. కళాశాలల్లో విద్యా ప్రమాణాలు లేకపోయినా ఎంసెట్ కౌన్సెలింగ్ కు అనుమతించాలంటూ హకుం జారీ చేసారు. బెదరింపులకు గురిచేసిన వారిలో ఓ జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వైసీపీ ఎమ్మెల్సీ ఉన్నారు అని తెలుస్తుంది.

అధికార పార్టీ నేతల బెదరింపులపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన వైస్ ఛాన్సలర్ శ్రీనివాస కుమార్… వారికి ఫిర్యాదు చేసారు. తన ప్రాణాలకు ముప్పు ఉంది అని ఆవేదన వ్యక్తం చేసారు. జెఎన్టీయూకు కోట్లలో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు బకాయిలు ఉన్నాయి. చెల్లించేది లేదంటూ జెన్టీయూ వైస్ ఛాన్సలర్ పై బెదిరింపులకు దిగారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ , జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలో లోపాలను గుర్తించిన అధికారులు… వాటిని నిషేధించారు.

Read more RELATED
Recommended to you

Latest news