ఆదినారాయణరెడ్డి ఏరియాలోకి.. మీరు ఎలా వస్తారు?

-

వైఎస్సార్‌ కడప జిల్లాలో పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శిస్తున్నారు. వారి అతిలో భాగంగా వైసీసీ నేతలను పోలీసులు బుధవారం హౌజ్‌ అరెస్ట్‌ చేశారు.   జమ్మలమడుగు మండలం గొరిగేనూర్‌కు చెందిన చాలా మంది కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు బుధవారం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం వైఎస్సార్‌ సీపీ నాయకులు అవినాశ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సురేశ్‌బాబు, శంకర్‌రెడ్డిలను తమ గ్రామానికి ఆహ్వానించారు. దీంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంల్లో మీరు పర్యటించడానికి కుదరదంటూ..భద్రత కారణాలను చూపుతూ … పులివెందులలో వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలను, కడపలో మేయర్‌ సురేశ్‌ బాబును, ఎర్రగుంటలో జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డిలను ముందస్తు అరెస్ట్ చేశారు.

ప్రజస్వామ్యంలో ఈతరహా అరెస్టులు ఎన్నడు చూడలేదంటూ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా పోలీసులు అతి చేయాలని చూస్తే.. అది ప్రభుత్వానికి మచ్చగానే మిగులుతుంది అనే విషయాన్ని సర్వత్రా చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news