ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో..?

-

వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఈనెల 26న తాడెపల్లిలోని పార్టీ ఆఫీస్ లోని సీఎం జగన్ మేనిఫెస్టో ను విడుదల చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మళ్లీ అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామనే అంశం పై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉండగా.. మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్టుకొని పలు జనాకర్షణ పథకాలను ప్రకటిస్తారని సమాచారం తెలుస్తోంది. 

జగన్ ఇప్పటికే ఏపీలో ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చాయి. మరోసారి సీఎంగా జగన్ అధికారంలోకి వస్తే.. మరింత మేలు చేకూరుస్తాయనే ధీమాలో ఉన్నారు. మరోవైపు ఎలాగైనా చంద్రబాబు అధికారంలోకి రావాలనే ఆశతో ఎదురుచూస్తున్నారు. చంద్రబాబుకు ఇటు జనసేన.. అటు బీజేపీ మద్దతు ఉండటంతో ఎలాగైనా అధికారంలోకి వస్తామనే ధీమాలో ఉన్నామని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news