YCP పై ఆనం మరోసారి సంచలన వ్యాఖ్యలు..వాళ్లు బాత్ బచ్చాగాళ్లు !

-

YCP పై మరోసారి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మాట్లాడుతున్నానని..సీనియర్ నేతగా చెప్పాలని భావించే.. వాస్తవాలను మాట్లాడానని చెప్పారు. కొందరు తాము వెంకటగిరికి ఇన్చార్జిగా వస్తామని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్నారని..ప్రస్తుతం ఎమ్మెల్యే నేనా లేక వేరేవారా అని ప్రజల్లో అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు.

ప్రజలు అనుకుంటున్న విషయాన్ని పార్టీ పరిశీలకుడి దృష్టికి తీసుకెళ్ళానని.. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యే గా ఉన్నాను… ప్రజల అభిమానం మద్దతు నాకు ఉంది.వేరే స్థానానికి ఎందుకు పోతానన్నారు. వై.ఎస్.ఆర్ హయాంలో ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాలేదని.. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన పనులు కావడం లేదన్నారు. నా గురించి బాత్ బచ్చాగాళ్లు మాట్లాడుతున్న మాటలను పట్టించుకోనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news