లోకేష్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలపై వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ పార్టీ నేతలంతా దుశ్శాసనులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత. అది నారీ సంకల్ప దీక్ష కాదు…దుస్సంకల్ప దీక్ష అని నిప్పులు చెరిగారు. నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత టీడీపీకి లేదని.. లోకేష్ పీఏ మహిళల పట్ల లైంగిక వేధింపులు చేస్తున్నారని చెప్తే దాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. లోకేష్ స్విమ్మింగ్ పూల్ ఫోటోలు చూస్తే వారికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని చురకలు అంటించారు.

టీడీపీలో చాలా మంది నాయకులు దుశ్శాసనుల్లా మారారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని పసుపు కుంకుమ అంటూ మహిళలను చంద్రబాబు మోసం చేసాడని.. రిషితేశ్వరికి న్యాయం చేయలేని ప్రభుత్వం చంద్రబాబుదని స్పష్టం చేశారు. వినోద్ జైన్ లాంటి వాళ్లను పెంచి పోషిస్తున్న చంద్రబాబు ఏ విధంగా దీక్షలు చేయిస్తున్నాడని.. వినోద్ జైన్ లాంటి వారు ఈ సంఘంలోనే బతికే అర్హత లేదని పేర్కొన్నారు. అతనికి ఉరి శిక్ష వేయాలని సీఎం గారిని కోరుతున్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news