జగన్ కు రఘు లేఖ, హెల్త్ ఎమర్జెన్సీ అంటూ…!

-

ఏలూరు ఘటన జాతీయ స్థాయిలో సంచలనం అయింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయో అని అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు లేఖ రాసారు. ఏలూరు ఘటన తీవ్రంగా కలిచివేసింది అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ, పరిసర ప్రాంతాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి అని డిమాండ్ చేసారు.

నిపుణులైన వైద్యులను, అవసరమైన మందులను ఇచ్చి ఏలూరుకు పంపాలని విజ్ఞప్తి చేసారు. ఎయిమ్స్ తో పాటు ఇతర ప్రముఖ వైద్యులను సంప్రదించి పరిష్కార మార్గం కనుగొనండి అని ఆయన సూచించారు. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో విస్తృత పరిశోధన సదుపాయాలు ఉన్న ఏషియన్ గ్యాస్ర్టో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరెడ్డితో మాట్లాడండి అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత శ్రద్ద తీసుకుని సమస్య మూలాలను తెలుసుకుని పరిష్కరించాలని సిఎం కు విజ్ఞప్తి చేసారు

Read more RELATED
Recommended to you

Latest news