విజయసాయి రెడ్డి ట్వీట్ : బాబుకు అది అలవాటే..!

-

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ, విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. “కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వ నాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని” అంటూ సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news