న్యాయాన్ని ఓడించడానికి చంద్రబాబు కోట్లు ధారపోస్తున్నారు: వైసీపీ ఎంపీ

-

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఈ కేసులో బెయిల్ కానీ లేదా చంద్రబాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ లో కానీ ఏ విధమైన అభివృద్ధి లేదు. ఇక నవంబర్ 1వ తేదీ వరకు మళ్ళీ రిమాండ్ ను పొడిగించించడంతో టీడీపీ నేతలు నిరాశలో మునిగిపోయారు. ఇక తాజాగా ఈ విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు ఎలాగైనా చట్టం కళ్ళ నుండి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడన్నారు. చంద్రబాబు దేశంలోనే పేరు మోసిన లాయర్లను కోట్లు పెట్టి పిటిషన్ లు వేయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డి.

ఎంత డబ్బు పెట్టినా చట్టాన్ని కొనడం వీలుకాదని చంద్రబాబు అండ్ కో కు విజయసాయి రెడ్డి చెప్పారు. ఇక టీడీపీ ఎంతలు ఇప్పుడు అప్పుడే చంద్రబాబు జైలు నుండి విడుదల కావడం కుదరదేమో అని ఫిక్స్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news