“నారా”రూప రాక్షసుడు DP రిలీజ్ చేసిన వైసీపీ

-

ఈ రోజు అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు లో జరిగిన ఘటన గురించి రాష్ట్రము అంతా మాట్లాడుకుంటోంది. ఇంతకాలం చంద్రబాబు చాలా బేషజాన్ని ప్రదర్శించి ఎన్నికలు దగ్గర పడుతున్న రోజుల్లో ఇలా చేయడం ఎవ్వరూ ఊహించి ఉండరు. చంద్రబాబు పుంగనూరు లో 2 వేల మంది కార్యకర్తల ద్వారా వైసీపీ నేతలు మరియు పోలీసులపై దాడి చేయించి ఒక్కసారిగా ప్రజల దృష్టిలో చెడుగా మారిపోయారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు అంతా చంద్రబాబుపై తమ ఆగ్రహాన్ని చుపిస్తున్నారు. తాజాగా ఈ దాడులకు నిరసనగా వైసీపీ ఒక డీపీ ని విడుదల చేసింది. ఇందుకు టీడీపీకి మరియు చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ “నారా రూప రాక్షసుడు” అనే కామన్ డీపీ ని విడుదల చేసింది.

ఇప్పుడు చంద్రబాబు పిల్ల చేష్టలకు వ్యతిరేకంగా ఈ డీపీని అందరూ వాడాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఆ దాడికి నిరసనగా రేపు చిత్తూరు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news