ఘనంగా ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని మ్యారేజ్..హాజరైన టాలీవుడ్ సెలబ్రిటీలు

-

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడు యంగ్ హీరో ఆది పినిశెట్టి మ్యారేజ్ బుధవారం ఘనంగా జరిగింది. రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ యంగ్ హీరో ఆది..తన లవర్ నిక్కి గల్రానిని పెళ్లి చేసుకున్నాడు.

బంధువులు, ఆత్మీయుల నడుమ ఆది పినిశెట్టి-నిక్కి గల్రాని పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ వేడుకకు పినిశెట్టి బంధువులు, స్నేహితులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఆర్య, సయేషా సైగల్, నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ తదితరులు ఆది మ్యారేజ్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. ‘మరకతమణి’ సినిమా షూటింగ్ టైంలో లవ్ లో పడ్డ వీరిరువురు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది మార్చి 24న వీరి ఎంగేజ్ మెంట్ జరగగా, తాజాగా మ్యారేజ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news